AP News: మరో హామీ అమలుచేసిన ఏపీ ప్రభుత్వం.. వారికి ఫుల్ పవర్స్!

8 months ago 11
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న కూటమి సర్కారు.. మరో హామీని నెరవేర్చింది. ఆలయాల్లో అర్చకులకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో కూడా జారీ చేసింది. ఆలయాల్లో జరిగే వైదిక విధుల్లో పూజారులకు విస్తృత అధికారాలు కల్పించింది. ఇందులో దేవాదాయ కమిషనర్ సహా ఇతరులు జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. మరోవైపు ప్రతి ఆలయంలో వైదిక కమిటీలను ఏర్పాటు చేయాలని.. వారి సూచనల ప్రకారం నడుచుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Read Entire Article