ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త ఆలోచన చేస్తోంది. ప్రజల చేతిలో పల్లె రహదారుల సమాచారం ఉండేలా త్వరలోనే ‘జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం’ అనే వ్యవస్థను అందుబాటులోకి తేనుంది. రెండు రోజుల్లోగా దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ పూర్తి చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్టుగా అడవి తల్లి బాటకు అనుసంధానం చేయాలని సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి పారుదల శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన పవన్ కళ్యాణ్.. పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.