ఏపీ ప్రభుత్వం విదేశాల్లో వైద్య విద్య చదివిన విద్యార్థులకు తీపికబురు వినిపించింది. విదేశాల్లో వైద్య విద్య చదివిన వారికి శాశ్వత రిజిస్ట్రేషన్ పత్రాలు జారీ చేయనుంది. ఇప్పటికే నలుగురికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చేతుల మీదుగా శాశ్వత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు అందించారు. మిగిలిన వారికి రేపటి నుంచి (మార్చి 9) శాశ్వత రిజిస్ట్రేషన్ పత్రాలు అందించనున్నారు. మన రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో 66 మంది వైద్య విద్య పూర్తి చేసిన విద్యార్థులకు ఈ సర్టిఫికేట్లు అందించనున్నారు.