దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురవనున్నాయి. వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలలో మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సోమవారం సాయంత్రం ఆరు గంటలకు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.