ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఓ వైపు ఎండలు, మరోవైపు వానలు పడుతున్నాయి. ఆవర్తన ప్రభావంతో కొన్ని జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని చోట్ల పగటి పూట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకూ నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మరోవైపు శుక్రవారం పలు జిల్లాలలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.