ఏపీలో మూడ్రోజుల పాటు భారీ వానలు కురవనున్నాయి. ఈ నెలాఖరులో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. దీని ప్రభావంతో నవంబర్ 27,28,29 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని.. మిగతాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు,