ఏపీని వరుణుడు మరోసారి పలకరించనున్నాడు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు కొన్నిచోట్ల వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆవర్తనం ఒకట్రెండు రోజుల్లో అల్పపీడనంగా మారుతుందని.. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ అల్పపీడనం.. తమిళనాడు, శ్రీలంక వైపుగా కదలనున్నట్లు వెల్లడించారు.