ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు తీపికబురు వినిపించారు. వచ్చే రోజులలో విద్యుత్ ఛార్జీలను మరింత తగ్గిస్తామని సీఎం ప్రకటించారు. సచివాలయం వేదికగా జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. విద్యుత్ ఛార్జీలను మరింత తగ్గిస్తామని ప్రకటించారు. అలాగే అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలలో విస్తృతంగా ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్లను సీఎం చంద్రబాబు సూచించారు. ఉగాదికి రెండున్నర లక్షల ఇళ్లలో గృహ ప్రవేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.