ఆంధ్రప్రదేశ్లో రానున్న నాలుగు రోజులు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండటంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు సహా పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల దగ్గర ఉండకూడదని సూచించింది. తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.