ఏపీ వాసులకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురువనున్నాయి. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. నవంబర్ 21న దక్షిణ అండమాన్పై ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఈ ఆవర్తనం ఈ నెల23 నాటికి అల్పపీడనంగా బలపడనుంది. ఈ అల్పపీడనం 25న వాయుగుండంగా మారుతుందని.. దీని ప్రభావంతో నవంబర్ 27, 28 తేదీల్లో ఏపీలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.