ఏపీవాసులకు అలర్ట్.. రాష్ట్రంలో మరో మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. శనివారం రోజున పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్త హెచ్చరించింది. అలాగే కొన్ని చోట్ల మోస్తారు వర్షం కురుస్తుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ అంచనా వేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు జూలై 24 వరకూ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.