అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ నగరంలో బుధవారం వాన దంచికొట్టింది. సుమారుగా రెండు గంటలపాటు వర్షం కురవటంతో పలు ప్రాంతాలలో రహదారులు జలమయమయ్యాయి. అయితే ఇదే సమయంలో బుడమేరుకు వరదలు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ఈ వార్తలను ఖండించారు. ఇలాంటి వదంతులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.