ఏపీలో ఖాళీ కానున్న రాజ్యసభ సీట్ల కేటాయింపుపై ఎన్డీఏ పార్టీల మధ్య లెక్క తేలింది. తెలుగుదేశం పార్టీ 3, జనసేన ఒక రాజ్యసభ స్థానం తీసుకోనున్నాయి. గురువారం రోజున టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఈ విషయంపై భేటీయై చర్చించారు. అనంతరం సీట్ల కేటాయింపుపై ప్రకటన చేశారు. అభ్యర్థులను త్వరలోనే ప్రకటించనున్నారు.