ఆంధ్రప్రదేశ్లో చాలా రోజుల తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సుమారు మూడేళ్ల తర్వాత ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. మే 7వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కొత్త రేషన్ కార్డులు ఎన్నిరోజులకు మంజూరు చేస్తారనే దానిపై అధికారులు పలు వివరాలు వెల్లడించారు. కొత్త రేషన్ కార్డులు మంజూరు, విభజన వంటి వాటికి 21 రోజులు సమయం పడుతుందని చెప్తున్నారు. అలాగే ఆగస్టు నెలలో కొత్త రేషన్ కార్డులు అందించే అవకాశం ఉందని సమాచారం.