AP School Holidays: తీరం దాటనున్న వాయుగుండం.. రేపు ఈ జిల్లాలలో స్కూళ్లకు సెలవు

1 year ago 42
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అనంతపురం, శ్రీసత్యసాయి, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, జిల్లాల్లో పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించారు. మరోవైపు రేపు తెల్లవారుజామున వాయుగుండం తీరం దాటుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అనంతరం క్రమంగా బలహీనపడుతుందని అంచనా వేసింది.
Read Entire Article