ఏపీని మొంథా తుపాను భయపెడుతోంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షా్లు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. కృష్ణా, అన్నమయ్య, తూర్పు గోదావరి జిల్లాలలో రెండు నుంచి మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 28వ తేదీన కాకినాడ సమీపంలో తుపాను తీరం దాటనుంది. ఈ సమయంలో బలమైన ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల మధ్య ఈ నిర్ణయం తీసుకున్నారు.