నైరుతి రుతుపవనాల ప్రభావంతో మంగళవారం రోజు ఏపీలోని పలు జిల్లాలలో వర్షాలు కురవనున్నాయి. పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అలాగే ఎండల ప్రభావం కూడా చూపించే అవకాశం ఉందని.. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సోమవారం రాత్రి వేళ కూడా పలు జిల్లాలలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ అంచనా వేశారు.