ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక. మంగళవారం రోజున రాష్ట్రంలోని పలు జిల్లాలలో పిడుగులతో కూడిన వానలు కురిసేందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వానలతో పాటుగా పలు జిల్లాలలో ఎండలు కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని.. విభిన్న వాతావరణ పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.