ఏపీవాసులకు ముఖ్య గమనిక. ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం ఏపీలోని పలు జిల్లాలలో వర్షాలు కురవనున్నాయి. పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరోవైపు మార్కాపురం జిల్లాలో పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి చనిపోయాడు. మరో నలుగురు గాయపడగా.. ఆస్పత్రికి తరలించారు.