ఏపీవాసులకు శుభవార్త. మండే ఎండల నుంచి కాసింత ఉపశమనం లభించనుంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో మంగళవారం పలు జిల్లాలలో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. మరికొన్ని జిల్లాలలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని.. విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.