ఏపీ ప్రజలకు అలర్ట్.. మరికొన్ని గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలలో పిడుగులతో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. చిత్తూరు, మార్కాపురం, నంద్యాల, ప్రకాశం జిల్లాలో పిడుగులతో మోస్తరు నుంచి భారీ వర్షం పడేందుకు అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వచ్చే రెండు రోజులు రాయలసీమ జిల్లాలలో వర్షాలు కురుస్తాయని.. ఉత్తరాంధ్ర జిల్లాలలో మాత్రం వడగాల్పుల ప్రభావం ఉంటుందని తెలిపింది.