ఏపీవాసులకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో పిడుగులతో కూడిన వర్షం పడేందుకు అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసిన విపత్తుల నిర్వహణ సంస్థ.. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రైతులు, కూలీలు పొలాలలో ఉండవద్దని హెచ్చరించింది.