ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక. గురువారం రోజు ఎనిమిది మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 17 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఉత్తరాంధ్ర జిల్లాలలో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. రాయలసీమ జిల్లాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.