ఆధ్యాత్మిక శోభతో అలరారే తిరుపతి రైల్వే స్టేషన్ను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా పునరుద్ధరించేందుకు కార్యాచరణ ప్రణాళిక శరవేగంగా రూపొందుతోంది. వికసిత్ భారత్ మిషన్లో భాగంగా చేపట్టనున్న ఈ అభివృద్ధి పనులు పూర్తయితే.. నిత్యం లక్షన్నర మందికి పైగా భక్తులు, ప్రయాణికులు మరింత సులభంగా.. అత్యంత సౌకర్యవంతంగా రాకపోకలు సాగించేందుకు వీలు కలుగుతుంది.