విద్యార్థులకు ఏసీఏ తీపికబురు వినిపించింది. ఏపీఎల్ క్రికెట్ మ్యాచులకు ఉచితంగా అనుమతించనుంది. జూన్ 9వ తేదీ నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. విశాఖ, కడప, మంగళగిరి వేదికగా మ్యాచులు జరగనున్నాయి. జూన్ 30వ తేదీ ఫైనల్ జరుగుతుంది. అయితే టోర్నీకి ఆదరణ పెంచాలనే ఉద్దేశంతో విద్యార్థులను స్టేడియాల్లోకి ఉచితంగా అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఏసీఏ వెల్లడించింది.