Balakrisha Emotional Speech At NTR Trust | మీ అందరి సహాయం మాకు కావాలి

1 year ago 22
బాలకృష్ణ మాట్లాడుతూ "సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు" అనే ఎన్టీఆర్ ఆశయాన్ని సాధించడంలో వారు కట్టుబడి ఉన్నామని తెలిపారు. తన తల్లిదండ్రులను స్మరించుకుంటూ, సమాజహితం కోసం పనిచేస్తామని అన్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్, విద్యాలయాలు, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నామని గర్వంగా చెప్పారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే, భారత్‌లో తలసేమియా బారిన పడిన చిన్నారుల సంఖ్య ఎక్కువ. హైదరాబాద్‌లో దాదాపు 3500 మంది బాధితులు ఉన్నారు. ఎన్టీఆర్ తలసేమియా కేర్ సెంటర్ ద్వారా 250 మందికి ఉచిత వైద్యం అందిస్తున్నామని, ఈ సేవలను విస్తరించేందుకు 25 పడకల ఆస్పత్రిని ప్రారంభిస్తున్నామని చెప్పారు. అమరావతిలోనూ తలసేమియా కేర్ సెంటర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు.
Read Entire Article