తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా.. ఎన్నికల వ్యయంపై కఠిన నిబంధనలను అమలు చేయాలని గద్వాల జిల్లా వ్యయ పరిశీలకులు రాజేష్ బాబు తెలిపారు. సర్పంచ్ పదవికి పోటీ చేసే ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా ప్రత్యేక బ్యాంక్ ఖాతాను తెరవాలని.. ఎన్నికల ఖర్చులన్నీ దాని నుంచే నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. అభ్యర్థులు నామినేషన్ వేసినప్పటి నుంచి ఫలితాల వరకు చేసిన ఖర్చు వివరాలను.. ఖర్చుల పరిమితికి లోబడి, బిల్లులతో సహా అధికారులకు సమర్పించాలి. ఎన్నికల్లో పారదర్శకత పెంచడం, అక్రమాలకు అడ్డుకట్ట వేయడం ఈ నిబంధన ముఖ్య లక్ష్యం.