Police identify Poker Players by using Drone: ఏపీ పోలీసులు టెక్నాలజీ వాడకానికి పెద్ద పీట వేస్తున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల సాయంతో నేరాల కట్టడికి చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే బాపట్ల జిల్లాలో డ్రోన్ సాయంతో పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. బాపట్ల జిల్లాలోని చుండూరులో పెద్దఎత్తున పేకాట జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. అయితే అక్కడకు చేరుకున్న పోలీసులు మారుమూల ప్రాంతం కావటంతో పేకాట ఎక్కడ జరుగుతోందో గుర్తించలేకపోయారు. దీంతో డ్రోన్ ఎగరవేయగా.. దట్టమైన చెట్ల మధ్య పేకాట ఆడుతున్న పదిమందిని గుర్తించారు.