తెలంగాణలో నేడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం బీసీ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. షాపులన్ని మూతపడ్డాయి. కేవలం ఆస్పత్రులు, అంబులెన్సులు వంటి వాటికి మాత్రమే అనుమతి ఇచ్చారు. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. నేడు జరగాల్సిన పరీక్షలను రద్దు చేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కావడంతో.. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు రెచ్చిపోతున్నారు. రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తూ.. ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారు. ఆ వివరాలు.