మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్ సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్.. బిల్ గేట్స్ బృందంతో భేటీ కానున్నారు. ఈ భేటీలో సంజీవని ప్రాజెక్టు గురించి ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలిసింది. సంజీవని ప్రాజెక్టును.. ఏపీ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ సహకారం చేపడుతోంది. ఈ నేపథ్యంలో సంజీవని ప్రాజెక్టుతో పాటుగా ఇతర అంశాలపైనా బిల్ గేట్స్ బృందం.. ఏపీ ప్రభుత్వంతో చర్చించనున్నట్లు సమాచారం.