మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణకు పార్టీలో మరో కీలక పదవి దక్కింది. ఆమె బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యురాలిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా, ఫుడ్ కార్పొరేషన్ తెలంగాణ ఛైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆమెతో పాటు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జి. పద్మజారెడ్డి కూడా జాతీయ కౌన్సిల్ సభ్యురాలిగా ఎంపికయ్యారు. వీరు మూడేళ్ల పాటు ఈ పదవుల్లో కొనసాగుతారు.