అచ్చంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయన ఒక్కరే బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో అనుచరులు ఎవరూ పాల్గొనలేదు. అనంతరం మాట్లాడిన గువ్వల పార్టీలో క్రమశిక్షణగల కార్యకర్తగా పని చేస్తానని చెప్పారు.