ఓలా, ఉబెర్, రాపిడో క్యాబ్ డ్రైవర్లు ఇక నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ప్రయాణాలను త్వరలో చేస్తామని ప్రకటించారు. రైడ్-హైలింగ్ ప్లాట్ఫామ్లు విధిస్తున్న తక్కువ చార్జీల కారణంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న టారిఫ్ వ్యవస్థ డ్రైవర్ల జీవన విధానాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోందని అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న ఖర్చుల, రూం రెంట్ల కారణంగా.. ప్రయాణ ఛార్జీలను పెంచాలని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ కోరుతోంది. డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ నెరవేరే వరకు విమానాశ్రయ ప్రయాణాలను బహిష్కరించడానికి నిర్ణయించుకున్నారు.