రైలు ప్రయాణికులకు అలర్ట్.. రైల్వే ట్రాక్ పనుల కారణంగా నవంబర్ 20వ తేదీన విజయవాడ దువ్వాడ సెక్షన్ మధ్య నడిచే పలు రైళ్లు రద్దు అయ్యాయి. నాలుగు ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించుకోవాలని సూచించింది. మరోవైపు ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో నరసాపురం సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.