ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే రైల్వే మంత్రితో భేటీ అయిన చంద్రబాబు.. పలు ప్రాజెక్టులు, రైల్వే లైన్లపై అశ్వినీ వైష్ణవ్కు వినతి పత్రం సమర్పించారు. తిరుపతి మీదుగా విజయవాడ బెంగళూరు వందేభారత్ రైలును నడపాలని కోరిన చంద్రబాబు.. ఏపీలో నాలుగు గ్రీన్ఫీల్డ్ మెగా కోచింగ్ టెర్మినల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే చెన్నె బెంగళూరు హైస్పీడ్ రైలును తిరుపతికి కనెక్ట్ చేయాలని కోరారు.