Chandrababu: అమరావతి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్న చంద్రబాబు సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు, వ్యక్తులు, తెలుగువారిని అందులో చేర్చుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అదే సమయంలో ఏపీ బ్రాండ్ను ప్రమోట్ చేసేందుకే దావోస్ వెళ్లినట్లు చెప్పిన చంద్రబాబు.. అక్కడ ప్రపంచ దేశాలకు చెందిన సంస్థలు, అధిపతులను కలిసినట్లు వెల్లడించారు.