Chandrababu: నేను చేసే కార్యక్రమాలు చూసి వనజీవి రామయ్య చెట్లు నాటేవారు..

11 hours ago 2
వనజీవి రామయ్య గురించి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పద్మశ్రీ వనజీవి రామయ్య తన దగ్గరకు ఎప్పుడూ వచ్చేవారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఎప్పుడొచ్చినా తన వెంట మొక్కను తెచ్చేవారని అన్నారు. ఊరూరా తిరిగి, మొక్కలు, విత్తనాలు పంచేవారని చంద్రబాబు అన్నారు. తాను చేసే కార్యక్రమాలు చూసి వనజీవి రామయ్య స్ఫూర్తి పొందేవారని.. మరింత ఉత్సాహంతో రోజుకు ఒక మొక్క నాటేవారని గుర్తుకు తెచ్చుకున్నారు. తనతో పాటు ఇతరులతోనూ ఆ పనిచేయించారని.. అందుకే కేంద్ర ప్రభుత్వం వనజీవి రామయ్యకు పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించిందన్నారు. వనజీవి రామయ్య స్ఫూర్తితో మనం కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
Read Entire Article