విజయవాడను వరదలు ముంచెత్తాయి. తిండీ,నీరు లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు ముందుకువస్తున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన స్కూలు విద్యార్థులు తమ పాకెట్ మనీని వరద బాధితులకు విరాళంగా అందించారు. ఈ వీడియోను స్కూలు యాజమాన్యం వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచగా.. వైరల్ అవుతోంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. చిట్టి చేతులు గట్టిసాయం చేశాయంటూ ప్రశంసించారు.