తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యార్థులకు వారానికి మూడు రోజులు రాగి జావ, మిగిలిన మూడు రోజులు పాలు పంపిణీ చేయాలని డిసైడ్ అయింది. దీని ద్వారా దాదాపు 19 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఇక తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో వచ్చే ఏడాది నుంచి అల్పాహార పథకం అమల్లోకి రానుంది.