రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది మృతి చెందగా, ఈ ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీ (TG06T3879) పై ఇదివరకే రెండు ట్రాఫిక్ చలాన్లు ఉన్నట్లు వెల్లడైంది. అక్రమంగా.. నిషేధిత సమయాల్లో భారీ లోడ్తో నగరంలోకి ప్రవేశించినందుకు సైబరాబాద్ పోలీసులు గతంలో రూ. 3,270 జరిమానా విధించారు. ప్రమాద సమయంలోనూ టిప్పర్ అతివేగంగా, రాంగ్ రూట్లో ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. మృతి చెందిన టిప్పర్ డ్రైవర్ను మహారాష్ట్రకు చెందిన ఆకాష్ కాంబ్లేగా గుర్తించారు.