శ్రీరామనవమి కారణంగా మాంసం విక్రయాలు తగ్గిపోయాయి. అంతే కాకుండా, బర్డ్ ఫ్లూ భయం కూడా ప్రజల వద్ద చికెన్ వినియోగాన్ని తగ్గించింది. ఈ పరిణామాలతో చికెన్ ధరలు భారీగా పతనమయ్యాయి. విజయవాడలో కేజీ ధర సుమారు 40 రూపాయలు వరకు తగ్గింది. ఇది ఒక్కో ప్రదేశంలో ఒక్కో రీతిన ధరలు ఉన్నాయి. మరికొన్ని కేంద్రాల్లో రూ.70 వరకు చికెన్ ధర తగ్గింది. ఇటు తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉంది. హైదరాబాద్లో చికెన్ కేజీ ధర రూ.230కి తగ్గింది.