CII Summit 2025: విశాఖలో జరిగిన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో రెండు రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ కు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం చంద్రబాబు తెలిపారు. దావోస్ తరహాలో జరిగిన ఈ సదస్సుకు 60 దేశాల ప్రతినిధులు హాజరయ్యారని ప్రకటించారు. రెండు రోజుల్లో 67 సెషన్లు, 700కు పైగా బీటూబీ సమావేశాలు జరిగాయి. శ్రీసిటీలో మరో 12 యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం 613 ఎంవోయూలు కుదుర్చుకున్నారు. ఆ వివరాలు..