సైబర్ మోసగాళ్లు ఇప్పుడు పోలీస్ అధికారులను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఖైరతాబాద్ జోన్ డీసీపీ కె. శిల్పవల్లికి నకిలీ ట్రాఫిక్ చలాన్ మెసేజ్లు రాగా.. వెంటనే సైబర్ క్రైంలో ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయవద్దని, అధికారిక వెబ్సైట్లను మాత్రమే సంప్రదించాలని ఆమె ప్రజలకు సూచించారు. ఈ స్కామ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.