పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్థాన్ పౌరులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని భారత్ హెచ్చరించింది. దీంతో వివిధ కారణాలతో ఇండియాకి వచ్చిన పాక్ పౌరులంతా వాఘా సరిహద్దు ద్వారా దేశం దాటుతున్నారు. మరోవైపు, కేంద్ర హోంశాఖ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం స్థానికంగా ఎవరైనా పాకిస్థానీయులు ఉన్నారా అని ఆరా తీస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు భారత్లో పాకిస్థానీలు ఎక్కడెక్కడ.. ఎంతమంది ఉన్నారనే లెక్క బయటపడుతోంది. అయితే, ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక పాకిస్థాన్ అమ్మాయి ఉందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ అమ్మాయి విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అసలు ఆ అమ్మాయి ఎవరు?.. పాకిస్థాన్ నుంచి వచ్చి శ్రీ సత్యసాయి జిల్లాలో ఎందుకు ఉంటోంది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.