Diarrhoea in Gurla: డయేరియా మృతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సాయం.. 10 లక్షలు

1 year ago 35
విజయనగరం జిల్లా గుర్లలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. గుర్లలో అతిసారం కారణంగా పది మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో గుర్ల గ్రామంలో పర్యటించిన పవన్ కళ్యాణ్.. డయేరియాతో బాధపడుతున్న వారిని పరామర్శించారు. నీటి సరఫరా కేంద్రాన్ని పరిశీలించారు. అలాగే స్థానిక కలెక్టర్‌తో సమావేశమై మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతుల కుటుంబాలకు వ్యక్తిగతంగా లక్ష రూపాయల చొప్పున సాయం ప్రకటించారు. పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి పరిహారం ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.
Read Entire Article