Andhra Pradesh Rains: దిత్వా తుఫాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు, తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని అంచనా. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. దిత్వా తుఫాన్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.