ఏపీవాసులకు సీఎం చంద్రబాబు శుభవార్త వినిపించారు. ఏపీలో త్వరలోనే డ్రోన్ ట్యాక్సీలను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. విశాఖ సీఐఐ సదస్సులో మాట్లాడిన చంద్రబాబు.. డ్రోన్ ట్యాక్సీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఏపీలో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు వర్చువల్గా శంకుస్థాపన జరిగింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీ.. తిరుపతి, సత్యసాయి జిల్లాలలో స్పేస్ సిటీలను అభివృద్ధి చేయనున్నారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది.