Duvvada Srinivas: బలి పశువును చేశారు.. తాత్కాలిక విరామం అనుకుంటా

10 months ago 19
వైఎస్సార్‌సీపీ నుంచి సస్పెండ్ చేయడంపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. తనకు ఇన్నాళ్లు గౌరవం ఇచ్చిన వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కోసం చాలా కష్టపడ్డానని.. అకారణంగా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత కారణాలను బూచిగా చూపించి రాజకీయ క్రీడలో బలిపశువును చేశారన్నారు. ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదని.. సస్పెన్షన్‌ను తాత్కాలిక రాజకీయ విరామంగా భావిస్తానన్నారు. తటస్థుడిగా ఉంటూ తనను నమ్ముకున్న అభిమానుల కోసం రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానన్నారు. అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ మూడు రోజుల క్రితం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
Read Entire Article