తూర్పుగోదావరి జిల్లావాసులను భయపెడుతున్న పెద్దపులి కథకు శుభం కార్డు పడింది. ఎట్టకేలకు అటవీ శాఖ సిబ్బంది పెద్దపులిని బంధించారు. మత్తు ఇంజెక్షన్ సాయంతో పెద్ద పులిని బంధించిన అటవీ శాఖ సిబ్బంది.. విశాఖపట్నం జంతుప్రదర్శన శాలకు తరలించారు. పెద్దపులి చిక్కటంతో స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. గత ఆరు రోజులుగా పశువుల మీద దాడి చేస్తూ పెద్దపులి ఈ ప్రాంతంలో భయాందోళనకు కారణమైంది. అయితే ఎట్టకేలకు రెస్క్యూ బృందం పులిని బంధించటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.