ఢిల్లీలోని కర్తవ్యపథ్ వేదికగా గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రిపబ్లిక్ డే సందర్బంగా నిర్వహించిన కవాతు వీక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన శకటాల ప్రదర్శన మంత్రముగ్ధులను చేసింది. ఈ శకటాల ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ శకటానికి స్థానం దక్కింది. ఆంధ్రప్రదేశ్ ఏటికొప్పాక బొమ్మల శకటం పరేడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఏటికొప్పాక బొమ్మలపై అందరి దృష్టి పడింది. ప్రధాని మోదీని సైతం ఈ బొమ్మలు ఆకర్షించాయి.